Nidhhi Agerwal | సవ్యసాచి సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది యువ కథానాయకి నిధి అగర్వాల్. ఈ సినిమా అనంతరం మిస్టర్ మజ్ను చేసిన కూడా రెండు సినిమాలు పెద్దగా బ్రేక్ని అందించలేకపోయాయి. అయితే పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘ఇస్మార్ట్శంకర్’తో బ్లాక్బాస్టర్ హిట్ కొట్టేసింది ఈ భామ. ఆ తర్వాత తెలుగుతో పాటు తమిళ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈ భామ తన కెరీర్ ప్రారంభంలో జరిగిన ఒక సంఘటన గురించి తాజాగా పంచుకుంది. తన మొదటి సినిమా టైంలో హీరోతో డేట్ చేయవద్దని చిత్రయనిట్ బాండ్ రాయించుకున్నారని తెలిపింది.
బాలీవుడ్ సీనియర్ నటుడు జాకీ ష్రాఫ్ తనయుడు టైగర్ ష్రాఫ్ హీరోగా నటించిన ‘మున్నా మైఖేల్’ సినిమాతో బాలీవుడ్లో నా సినీ ప్రస్థానం మొదలైంది. ఈ సినిమాకు ఒకే చెప్పిన తర్వాత చిత్రయూనిట్ నాతో ఒక కాంట్రాక్ట్పై సంతకం చేయించింది. ఆ కాంట్రాక్ట్లో సినిమాకు సంబంధించి నేను పాటించాల్సిన నియమాలు ఉన్నాయి. అందులో‘నో డేటింగ్’ అనే షరతు కూడా ఉంది. దానికి అర్థం సినిమా కంప్లీట్ అయ్యేవరకు నేను హీరోతో నేను డేటింగ్ చేయకుడదని. అయితే ఇది చూడాకుండా నేను సంతకం పెట్టాను. తర్వాత ఈ విషయం తెలిసి నేను చాలా షాక్ అయ్యాను. నటీనటులు ప్రేమలో పడితే పనిపై శ్రద్ధ తగ్గుతుందని టీమ్ భావించి ఉంటుంది. అందుకే ఇలాంటి నిబంధనలు జోడించి ఉంటారని అనుకున్నానంటూ నిధి చెప్పుకోచ్చింది. సినిమాల విషయానికి వస్తే.. నిధి ప్రస్తుతం పవన్ కళ్యాణ్తో కలిసి ‘హరి హర వీరమల్లు’ చిత్రంలో నటిస్తుంది. ఈ చిత్రం మే 09న ప్రేక్షకుల ముందుకు రానుంది.