తమిళ నటి వరలక్ష్మీ శరత్కుమార్కు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్.ఐ.ఏ) అధికారులు నోటీసులు జారీ చేశారు. ఆమె వద్ద వ్యక్తిగత సహాయకుడిగా కొద్ది రోజులు పనిచేసిన ఆదిలింగం అనే వ్యక్తి ఇటీవల డ్రగ్స్ కేసులో పట్టుబడ్డాడు. అతని వద్ద నుంచి దాదాపు 2100కోట్ల విలువైన హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నారు.
ఆదిలింగంకు అంతర్జాతీయ స్మగ్లర్లతో సంబంధాలున్నాయని, సినిమాల్లో కూడా పెట్టుబడులు పెట్టారని ఎన్.ఐ.ఏ అధికారులు నిర్దారించారు. ఈ నేపథ్యంలో అతన్ని కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ వ్యవహారంలో మరిన్ని వివరాల కోసం వరలక్ష్మీ శరత్కుమార్కు ఎన్.ఐ.ఏ అధికారులు సమన్లు జారీ చేసి ప్రశ్నించనున్నారు. ప్రస్తుతం ఈ వార్త తమిళ చిత్రసీమలో హాట్టాపిక్గా మారింది.