నాలుగేళ్ల విరామం తర్వాత బాలీవుడ్ ని తాప్సీ పన్ను (Taapsee Pannu) తెలుగు సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మిషన్ ఇంపాసిబుల్ టైటిల్తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ (Swaroop RSJ) ఫేం స్వరూప్ ఆర్ఎస్జే డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించి ఆసక్తికర అప్ డేట్ ను మేకర్స్ రివీల్ చేశారు. ఈ సినిమా నుంచి తొలి పాట అప్ డేట్ను పోస్టర్తోపాటు అందించారు మేకర్స్. ఎధామ్ గాలమ్ (Yedhaam Gaalam) అంటూ సాగే మొదటి పాటను ఫిబ్రవరి 23న విడుదల చేయనున్నట్టు తెలిపారు.
మార్క్ కే రోబిన్ ఈ పాటను కంపోజ్ చేయగా..డైరెక్టర్ హసిత్ గోలి పాటను రాశాడు. హేమచంద్ర, శ్రీరామ చంద్ర, రాహుల్ సిప్లిగంజ్ కలిసి పాట పాడారు. ఈ ప్రాజెక్టులో తాప్సీ స్వతంత్ర భావాలు కలిగిన జర్నలిస్టు పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే తన పాత్ర చిత్రీకరణ పూర్తి చేసింది. నిరంజన్ రెడ్డి, అన్వేశ్ రెడ్డి సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ మూవీని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. విడుదల తేదీపై త్వరలోనే స్పష్టత రానుంది.
తాప్సీ ప్రధాన పాత్రలో నటిస్తోన్న శభాష్ మిధు షూటింగ్ పూర్తి చేసుకుంది. మరోవైపు స్వీయనిర్మాణంలో నటిస్తున్న సినిమా బ్లర్ కూడా షూటింగ్ పూర్తయింది.