Tillu Square | డిజే టిల్లు సినిమా నేహాశెట్టి జాతకాన్నే మార్చేసింది. ఈ సినిమాలో రాధిక పాత్రలో నేహాశెట్టిని తప్పితే మరొకరిని ఊహించుకోని రేంజ్లో నటనతో కుమ్మేసింది. ఎంతలా ఉంటే బయట ఆమె కనిపిస్తే రాధిక అంటూ జనాలు ప్రేమగా పిలుచుకుంటున్నారు. ముఖ్యంగా యూత్లో ఆమె క్రేజ్ మాములుగా లేదు. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో యమ బిజీగా గడుపుతుంది. కుర్ర హీరోలకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారిపోయింది. ఇక ఇదిలా ఉంటే టిల్లు స్క్వేర్లో రాధిక కూడా ఉండబోతుందని తెలుస్తుంది.
ముందు నుంచి టిల్లు స్క్వేర్లో నేహాశెట్టి రోల్ ఉండదని సిద్దూ చెప్పుకుంటూ వచ్చాడు. అంతేకాకుండా తొలిపార్టుతోనే ఆమె రోల్కు ఎండింగ్ కార్డు పడిందని కూడా చెప్పాడు. అయితే తాజాగా ఈ సినిమాలో నేహా శెట్టి గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది. ఆమె రోల్ 3 నుంచి 4 నిమిషాల వరకు ఉండనుందట. సినిమాలో ఆమె పాత్ర చాలా కీలకం కానున్నట్లు తెలుస్తుంది. ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ.. నేహాశెట్టి మాత్రం సినిమాలో కనిపిస్తే థియేటర్లు దద్దరిల్లడం ఖాయం.
సితారా బ్యానర్లో తెరకెక్కుతున్న టిల్లు స్క్వేర్ సినిమాకు కూడా సిద్ధూనే కథను అందిస్తున్నాడు. కాగా ఈ సీక్వెల్ చిత్రాన్ని కొత్త దర్శకుడు మల్లిక్రామ్ తెరకెక్కిస్తున్నాడు. గతంలో ఆయన తేజ సజ్జాతో ‘అద్భుతం’ సినిమా తీశాడు. కాగా మొదటి భాగానికి దర్శకత్వం వహించిన విమల్ కృష్ణ.. హీరోతో బేధాబిప్రాయాలు రావడంతో సినిమా నుండి తప్పుకున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి.