ఇప్పుడు టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో నాగ చైతన్య- సమంత డైవర్స్ విషయం గురించే ఎక్కువగా చర్చ నడుస్తుంది. ఎంతో ఆప్యాయంగా ఉండే వారిద్దరు ఎందుకు విడిపోవలసి వచ్చింది అనే దానిపై క్లారిటీ లేదు. దీంతో ఎవరికి తోచినట్టు వారు ఊహాలోచనలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో సమంతతో శాకుంతలం సినిమా చేసిన నిర్మాత నీలిమ గుణ షాకింగ్ విషయాలను వెల్లడిచింది.
మా నాన్న( గుణశేఖర్) శాకుంతలం సినిమా కోసం సమంతని సంప్రదించగా, ఆమె అప్పటికే సినిమాలు చేయకూడదని నిర్ణయించుకుందట. ఫ్యామిలీ ప్లానింగ్ చేస్తున్నామని కొన్ని రోజులు సినిమాలకు దూరంగా ఉంటానని సమంత పేర్కొంది. అయితే శాకుంతం కథ నచ్చడంతో కొన్ని కండీషన్స్తో సమంత ఓకే చేసింది.
జూలై, ఆగస్ట్లోకెల్లా షూటింగ్ పూర్తిచేయాలని సామ్ కోరడంతో.. మేము ఓకే చెప్పి అలానే ప్లాన్ చేసుకున్నాం. సమంత శాకుంతలం తర్వాత సినిమాలు చేయనని, పిల్లల్ని కనేందుకు ప్లాన్ చేస్తున్నామని చెప్పింది. కానీ చైతూతో ఇలా విడిపోవడం షాకింగ్గా ఉందని జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో నీలిమ స్పష్టం చేసింది.