గ్యాంగ్స్టర్ నయీం జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘నయీం డైరీస్’. వశిష్ఠసింహా ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి దాము బాలాజీ దర్శకుడు. సీఏ వరదరాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్ను సోమవారం హైదరాబాద్లో దర్శకుడు సంపత్నంది విడుదలచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘కల్పిత కథాంశాలతో పోలిస్తే బయోపిక్లు ప్రేక్షకుల్లో ఎక్కువగా ఆసక్తిని రేకెత్తిస్తుంటాయి. ఈ సినిమా ట్రైలర్ కొత్తగా ఉంది’ అని తెలిపారు. ‘నయీం జీవితంతో ఈ సినిమా చేస్తున్నాం. యాక్షన్, థ్రిల్ అంశాలతో ఉత్కంఠభరితంగా సాగుతుంది’ అని నిర్మాత చెప్పారు. దర్శకుడు మాట్లాడుతూ ‘నక్సలైట్గా మొదలైన నయీం జీవితంలో ఏం జరిగిందనేది సినిమాలో కళ్లకు కట్టినట్లుగా చూపించబోతున్నాం. ఏడు సంవత్సరాలు జైలులో ఉన్న అతడు పోలీస్ ఇన్ఫార్మర్గా, క్రిమినల్గా ఎలా మారాడో ఆవిష్కరించాం’ అని పేర్కొన్నారు. పరిస్థితులు ప్రభావం వల్ల ఓ మనిషి ఎలా మారిపోతాడో అర్థవంతంగా చూపించే చిత్రమిదని వశిష్ఠసింహా చెప్పారు. ఈ కార్యక్రమంలో ఫణి, శశి తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: అరుణ్ ప్రభాకర్.