నాయిక తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘మిషన్ ఇంపాజిబుల్’. స్వరూప్ ఆర్ఎస్జే దర్శకత్వం వహిస్తున్నారు. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించారు. ఎన్ఎం పాషా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఏప్రిల్ 1న ఈ సినిమా విడుదల కానుంది. ఎంటర్టైనింగ్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ చిత్రానికి వాయిస్ ఓవర్ అందించారు యువ హీరో నవీన్ పోలిశెట్టి. స్వరూప్ ఆర్ఎస్జే తొలి చిత్రం ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’లో హీరోగా నటించారు నవీన్. ఈ స్నేహంతో స్వరూప్ కొత్త చిత్రానికి వాయిస్ అందించారు. ఈ సినిమాకు నవీన్ వాయిస్ ఓవర్ ఆకర్షణ అవుతుందని చిత్రబృందం చెబుతున్నది. రవీందర్ విజయ్, హరీష్ పరేది ఇతర పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : దీపక్ యెరగరా, ఎడిటింగ్ : రవితేజ గిరిజాల, సంగీతం : మార్క్ కె రాబిన్.