‘జాతిరత్నాలు’ సినిమాతో ఈ ఏడాది పెద్ద విజయాన్ని అందుకున్నారు హీరో నవీన్పొలిశెట్టి. ఆయన కథానాయకుడిగా సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ పతాకాలపై ఓ చిత్రం తెరకెక్కుతున్నది. కల్యాణ్శంకర్ ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. సూర్యదేవరనాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్నారు. బుధవారం ఈ సినిమా ప్రచార చిత్రాన్ని విడుదలచేశారు. ‘మన జాతిరత్నం వినోదాన్ని పంచడానికి సిద్ధమవుతున్నాడు. సరదాగా నవ్వుకోవడానికి సమాయత్తమవ్వండి’ అంటూ వీడియోలో చిత్రబృందం పేర్కొన్నది. నిర్మాతలు మాట్లాడుతూ ‘వినోదమే పరమావధిగా రూపొందుతున్న చిత్రమిది. నవీన్పొలిశెట్టి పాత్ర సరికొత్త పంథాలో ఉంటుంది. పూర్వ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాల్ని త్వరలో వెల్లడిస్తాం’ అని తెలిపారు. ఈ చిత్రానికి సమర్పకుడు: పీడీవీ ప్రసాద్.