నవీద్బాబు, శివాంగి మెహ్రా, ఇర్ఫాన్, నికీషా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ఇంటి నెం 13’. పన్నా రాయల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని హేసన్ పాషా నిర్మించారు. మార్చి 1న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రమిది. ప్రతి పదినిమిషాలకు వచ్చే ట్విస్ట్ ప్రేక్షకులకు థ్రిల్ని కలిగిస్తుంది.
విజువల్ ఎఫెక్ట్స్ ప్రధానాకర్షణగా నిలుస్తాయి’ అన్నారు. ఆనంద్రాజ్, తనికెళ్ల భరణి, పృథ్విరాజ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: పి.ఎస్.మణికర్ణన్, కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం: పన్నా రాయల్.