Siddhu Jonnalagadda | డీజే టిల్లు సినిమాతో సూపర్ హిట్ను ఖాతాలో వేసుకున్నాడు యువ హీరో సిద్దు జొన్నల గడ్డ (Siddhu Jonnalagadda). ఈ క్రేజీ యాక్టర్ ప్రస్తుతం డీజే టిల్లు సీక్వెల్ టిల్లు 2 (Tillu Square)తో బిజీగా ఉన్నాడని తెలిసిందే. కాగా పాపులర్ స్క్రీన్ రైటర్ కోన వెంకట్ సోదరి నీరజ కోన (Neeraja Kona) డైరెక్షన్లో సినిమా చేయబోతున్నాడని ఇప్పటికే ఓ వార్త ఇండస్ట్రీ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. కాగా ఈ సినిమాకు పనిచేయబోయే టీంకు సంబంధించిన వార్త ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది.
అద్బుతమైన వర్క్తో పలు చిత్రాలకు నేషనల్ అవార్డులు అందుకున్న సాంకేతిక నిపుణులు ఈ సినిమాకు పనిచేయబోతున్నారు. పీసీ శ్రీరామ్ (డీవోపీ), ఎస్ థమన్ (మ్యూజిక్), శ్రీకర్ ప్రసాద్ (ఎడిటర్), షర్మిష్ట రాయ్ (ఆర్ట్), బృందా మాస్టర్ (కొరియోగ్రఫీ), అర్చనా రావు (కాస్ట్యూమ్స్) సిద్దు-నీరజ కోన ప్రాజెక్ట్కు పనిచేయబోతున్నారని ఇన్సైడ్ టాక్. ఇదే నిజమైతే సిద్దు కొత్త సినిమా హైటెక్నికల్ వాల్యూస్తో ఉండబోతుండటం ఖాయమైనట్టే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. వివేక్ కూచిబొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.
నీరజ కోనవినిపించిన స్టోరీ లైన్ సిద్దును ఇంప్రెస్ చేసిందట.స్టైలిష్ట్గా పాపులర్ అయిన నీరజ కోన ఈ సినిమాతో ఫిల్మ్ మేకర్గా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటుంది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో రొమాంటిక్ జోనర్లో సాగేలా సినిమా ఉండబోతుందని ఇన్సైడ్ టాక్. సిద్దు ప్రస్తుతం టిల్లు 2తోపాటు దట్ ఈజ్ మహాలక్ష్మి, థల్లుమాలా రీమేక్లో కూడా నటిస్తున్నాడు.