ప్రస్తుత మా అధ్యక్షుడిగా ఉన్న నరేష్ శుక్రవారం రాత్రి తన నివాసంలో డిన్నర్ పార్టీ ఇచ్చారు. తాను అధ్యక్షుడు అయినప్పటి నుండి తనకు సహాయ సహకారాలు అందిస్తూ అన్ని విధాలుగా సపోర్ట్ అందించినందుకు మా సభ్యులకి కృతజ్ఞతగా పెద్ద పార్టీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి కమెడియన్ అలీ, నటులు శివ బాలాజీ, పృథ్వీ, సంపూర్ణేష్, కరాటే కళ్యాణి, సీనియర్ నటుడు రాజ్ కుమార్ సహా..100 మందికి పైగా హాజరయ్యారు.
మరి కొద్ది రోజులలో మా ఎలక్షన్స్ జరగనున్న నేపథ్యంలో నరేష్ పార్టీ ఏర్పాటు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల నరేష్పై హేమ దారుణమైన కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. నరేష్ అధ్యక్షుడిగా కొనసాగాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారని , ఇంతవరకు మా అసోసియేషన్ రూపాయి సంపాదించకపోగా ఉన్న 5 కోట్ల నిధులను నరేష్ 2 కోట్లకు తీసుకొచ్చారని 3కోట్లు వృధాగా ఖర్చు చేశారంటూ వాయిస్ రికార్డులో హేమ తెలిపారు దీనిపై స్పందించిన నరేష్.. అసోసియేషన్ గౌరవాన్ని దెబ్బతీసేలా హేమ మాట్లాడుతున్నారని , ఆమెపై క్రమోశిక్షణ సంఘానికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.