Tarakaratna | గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన నందమూరి తారకరత్న అత్యంత విషమంగా ఉంది. గుండె నాళాల్లోకి రక్తప్రసరణ కాకపోవడంతో ఆయన్ను బతికించేందుకు నారాయణ హృదయాలయ వైద్యలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. బెలూన్ యాంజియోప్లాజీ ద్వారా రక్తాన్ని పంపింగ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
నందమూరి తారకరత్న పరిస్థితి క్రిటికల్గా ఉందని తెలిసి నందమూరి కుటుంబసభ్యులు ఒక్కొక్కరుగా ఆస్పతికి చేరుకుంటున్నారు. ఇప్పటికే బాలకృష్ణ దగ్గర ఉండి తారకరత్న ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తుండగా.. మోహన్ కృష్ణ, నారా చంద్రబాబు, భువనేశ్వరి, దగ్గుబాటి పురందేశ్వరి తదితరులు ఆస్పత్రికి చేరుకున్నారు. కాసేపట్లో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఆస్పత్రికి రానున్నారు.
ఈ సందర్భంగా దగ్గుబాటి పురందేశ్వరి మాట్లాడుతూ.. తారకరత్న పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉందని వెల్లడించారు. సోమవారం మరోసారి పరీక్షలు చేస్తామని వైద్యులు చెప్పినట్టు పేర్కొన్నారు.