‘వీరసింహా రెడ్డి’ విజయోత్సవ వేడుకలో ‘అక్కినేని..తొక్కినేని’ అం టూ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై అగ్ర హీరో బాలకృష్ణ స్పందించారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ ఇండస్ట్రీకి రెండు కళ్లలాంటి వారని, నాగేశ్వరరావును బాబాయ్ అంటూ అప్యాయంగా పిలిచేవాడినని చెప్పారు. ‘నాగేశ్వరరావు బాబాయ్ నన్ను ఎంతో ఇష్టపడేవారు. బాబాయ్పై గుండెల్లో ప్రేమ ఉంటుంది. పొగడ్తలకు దూరంగా ఉండాలనే విషయాన్ని ఆయన నుంచే నేర్చుకున్నా. సక్సెస్మీట్లో నేను మాట్లాడిన మాటలు ఏవో ఫ్లోలో వచ్చినవి. కావాలని నేను అలా మాట్లాడలేదు’ అని బాలకృష్ణ వివరణ ఇచ్చారు.