Namrata Shirodkar | టాలీవుడ్ స్టార్ మహేశ్బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ ఎమోషనల్ అయ్యారు. తన కుమారుడు గౌతమ్ను ఉద్దేశిస్తూ ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్టు పెట్టారు. గౌతమ్ తనను విడిచి మొదటిసారి ఫారెన్టూర్ వెళ్లినట్లు చెప్పారు. గౌతమ్ వెళ్తుంటే.. తనలోని ఓ భాగం దూరం అవుతున్నట్లు అనిపించిందంటూ ఎమోషనల్ అయ్యారు.
‘కల్చర్ ట్రిప్లో భాగంగా గౌతమ్ మొదటిసారి నన్ను విడిచి ఫారెన్ వెళ్లాడు. నాలోని సగ భాగం దూరం అవుతున్న ఫీల్ వచ్చింది. దీన్ని జీర్ణించుకోవడానికి చాలా సమయం పట్టింది. రోజంతా శూన్యంగా గడిచింది. తను ఇంటికి తిరిగి వచ్చే వరకూ ఈ బాధ తీరదు. ఇంటిని వదిలి మా బాబు ఎగరగలుగుతున్నాడు. ఈ వారం మొత్తం సరదాలు, సంతోషాలు, సాహసాలతో గడవాలని కోరుకుంటున్నా. ఈ ప్రయాణంలో నిన్ను నువ్వు మరింత తెలుసుకోవాలని ఆశిస్తున్నా. ఈ ట్రిప్ నీకు ఎంతగానో ఉపయోగపడుతుందని నమ్ముతున్నాను. అలాగే నీ రాక కోసం ఎదురుచూస్తుంటా’ అంటూ నమ్రత తన పోస్ట్లో రాసుకొచ్చారు. గౌతమ్ తన ఫ్రెండ్స్ తో ఉన్న ఫోటోలను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.