Mahesh Babu | సూపర్స్టార్ మహేశ్బాబు ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరో వైపు వ్యాపార రంగంలోనూ రాణిస్తున్నారు. నటుడిగా, నిర్మాతగా, వ్యాపార వేత్తగా రెండు చేతులా సంపాదిస్తున్నారు. ఇప్పటికే మహేశ్ మల్టీప్లెక్స్ బిజినెస్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన రెస్టారెంట్ బిజినెస్లోకీ అడుగుపెట్టారు. ఏషియన్ గ్రూప్స్తో హైదరాబాద్లో రెస్టారెంట్ ప్రారంభించారు నమత్ర. మినర్వ గ్రూప్తో కలిసి మినర్వా -ఏఎన్ (ఏఎన్-ఏషియన్ నమ్రతా) పేరుతో బంజారాహిల్స్లో రెస్టారెంట్ ఏర్పాటు చేశారు. కాగా, బుధవారం నమ్రత, ఏషియన్ సునీల్ సమక్షంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ రెస్టారెంట్ గురువారం గ్రాండ్గా లాంచ్ కానుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలను నమ్రత సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు.
ఇప్పటికే మహేశ్ మల్టీప్లెక్స్ బిజినెస్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఆయన పేరుమీదున్న ఏఎంబీ సినిమాస్ ఇండియాలోనే బిగ్గెస్ట్ మల్టీప్లెక్స్లలో ఒకటి. ఇక మహేశ్ కేవలం థియేటర్ బిజినెస్ మాత్రమే కాకుండా టెక్స్టైల్స్ బిజినెస్లోనూ అడుగుపెట్టారు. మహేశ్కు సంబంధించిన అన్ని వ్యాపారాలను ఆయన సతీమణి నమ్రత శిరోద్కర్ చూసుకుంటుంటారు.
ప్రస్తుతం మహేశ్ బాబు.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో సినిమా చేస్తున్నాడు. మహేశ్ 28వ సినిమాగా రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్ర షూటింగ్ తొలి షెడ్యూల్ ఇప్పటికే పూర్తైంది. డిసెంబర్లో ఎస్ఎస్ఎంబీ 28 రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుందని చిత్ర బృందం ఇప్పటిక ప్రకటించింది. ఈ నేపథ్యంలో త్వరలో షూటింగ్ షురూ కానుండగా మ్యూజిక్ సిట్టింగ్స్ లో భాగంగా టీం మెంబర్స్ దుబాయ్కు వెళ్లారు.