Venkatesh | నాంపల్లి కోర్టులు, జనవరి 29 (నమస్తే తెలంగాణ): సినీ నిర్మాత దగ్గుపాటి సురేశ్బాబు, హీరో వెంకటేశ్, రానా, అభిరామ్, గడ్డం విశ్వనాథానికి వ్యతిరేకంగా కోర్టులో ప్రైవేటు పిటిషన్ దాఖలైంది. సాక్ష్యాధారాలను పరిశీలించిన అనంతరం 17వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ సాయిసుధ వారిపై కేసు నమోదు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.
దగ్గుపాటి కుటుంబీకులకు సమన్లు జారీ చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను జూలై 17త తేదీకి వాయిదా వేసింది. ఫిర్యాదుదారుడు నందకుమార్కు చెందిన దక్కన్ హోటల్ను అక్రమంగా కూల్చివేశారని, కోర్టు ఆదేశాలను సైతం తుంగలో తొక్కారని న్యాయవాది కోర్టుకు వివరించారు.