అగ్ర కథానాయకుడు అక్కినేని నాగార్జున ప్రతిష్టాత్మక 100వ చిత్రం ‘కింగ్ 100’ (వర్కింగ్ టైటిల్) షూటింగ్ మైసూర్లో మొదలై, అక్కడే కొంత భాగం చిత్రీకరణ పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్ర యూనిట్ మరోమారు మైసూర్ పయనమైంది. దానికి కారణం.. ఈ సినిమాలోని ఓ పీరియాడిక్ ఎపిసోడేనని ఇన్సైడ్ టాక్. కథకు కీలకమైన ఈ ఎపిసోడ్ సినిమాకే హైలైట్గా ఉంటుందట.
మైసూర్లోని పాతకాలపు భవనాలు, పచ్చని ప్రకృతి, ప్రశాంతమైన వాతావరణం, చారిత్రక కట్టడాలూ ఈ ఎపిసోడ్కు ఉపయోగపడతాయని దర్శకుడు రా.కార్తీక్ భావించడంతో షూట్ మైసూర్కి ఫిఫ్టయ్యింది. కథలో సహజత్వం కోసమే రా.కార్తీక్ ఈ ప్రదేశాలను ఎంచుకున్నట్టు చిత్రబృందం చెబుతున్నది. ఎమోషనల్ ఫ్యామిలీ యాక్షన్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ సినిమాలో నాగార్జున పాత్ర రాజసం ఉట్టిపడేలా పవర్ఫుల్గా ఉంటుందట. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రంలో టబూ కీలక పాత్ర పోషిస్తున్నారు. సస్మితాభట్ కథానాయికగా నటిస్తున్నట్టు తెలిసింది.