నాగార్జున కథానాయకుడిగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. నారాయణ్దాస్ కె నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు, శరత్మరార్ నిర్మిస్తున్నారు. కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్ర సెకండ్ షెడ్యూల్ ఈ నెల 4 నుంచి హైదరాబాద్లో ప్రారంభంకానుంది. నిర్మాతలు మాట్లాడుతూ ‘పూర్తిస్థాయి యాక్షన్ ప్రధానంగా రూపొందుతున్న చిత్రమిది. నాగార్జున పాత్ర పవర్ఫుల్గా ఉంటుంది. మునుపెన్నడూ కనిపించనటువంటి వైవిధ్యమైన పాత్రలో ఆయన నటిస్తున్నారు. గోవాలో తొలి షెడ్యూల్ను పూర్తిచేశాం. బుధవారం నుంచి హైదరాబాద్లో ప్రారంభంకానున్న సెకండ్ షెడ్యూల్లో ప్రధాన తారాగణంపై కీలక ఘట్టాలను చిత్రీకరిస్తాం. దేశ ప్రధాన నగరాలతో పాటు విదేశాల్లో షూటింగ్ను జరిపేందుకు ప్లాన్ చేస్తున్నాం’ అని తెలిపారు. గుల్ పనాంగ్, అనైకా సురేంద్రన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ముఖేష్.జి, కళా దర్శకత్వం: బ్రహ్మ కడలి.