కెరీర్లో తాను చేసిన తొలి క్రీడానేపథ్యచిత్రమిదని అన్నారు నాగశౌర్య. ఆయన హీరోగా నటించిన చిత్రం ‘లక్ష్య’. సంతోష్జాగర్లపూడి దర్శకుడు. నేడు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానున్నది. ఈ సందర్భంగా నాగశౌర్య పాత్రికేయులతో పంచుకున్న ముచ్చట్లివి..
అరుదైన ఆర్చరీ క్రీడా నేపథ్యంలో సాగే చిత్రమిది. కథ వినగానే నటుడిగా నన్ను కొత్త పంథాలో ఆవిష్కరించుకునే అవకాశం ఉందనిపించింది. ఆర్చరీని ఓ విద్యగా గౌరవించే సంస్కృతి పురాణాల నుంచి వస్తున్నది. ఎంతో మంది వీరులు విల్లును ఆయుధంగా చేసుకొని గొప్ప పోరాటాలు చేశారు. మరుగున పడిపోయిన విలువిద్య ఔన్నత్యాన్ని చాటిచెప్పే చిత్రమిది.
పార్ధు అనే ఆర్చరీ ప్లేయర్గా నేను ఈ సినిమాలో కనిపిస్తా. తనలోని చెడుతో పాటు ప్రపంచాన్ని అతడు ఎలా జయించాడన్నది స్ఫూర్తివంతంగా దర్శకుడు తెరపై ఆవిష్కరించారు. దర్శకుడు రాజమౌళి రూపొందించిన ‘సై’ స్ఫూర్తితో ఈసినిమా చేశాం. క్రీడానేపథ్యానికి కమర్షియల్ హంగులను జోడించి అర్థవంతంగా చెబితే ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం కలిగింది.
పెళ్లిచేసుకోమని ఇంట్లోవాళ్లు చాలా రోజులుగా అడుగుతున్నారు ఫస్ట్లాక్డౌన్ సమయం నుంచి పెళ్లి ఒత్తిడి బాగా పెరిగింది. మళ్లీ లాక్డౌన్ వస్తే తప్పకుండా పెళ్లి చేసుకుంటానని వారికి అబద్ధం చెప్పి తప్పించుకుంటున్నా.
అనీష్కృష్ణతో చేస్తున్న తదుపరి సినిమాలో బ్రాహ్మణ యువకుడిగా నటిస్తున్నా. ‘ఫలానా అమ్మాయి ఫలానా అబ్బాయి’ షూటింగ్ అరవై శాతం పూర్తయింది.