అక్కినేని నాగచైతన్య, పార్వతి తిరువోతు ప్రధానపాత్రధారులుగా విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో శరత్ మరార్ నిర్మించిన వెబ్ సిరీస్ ‘దూత’. ప్రపంచవ్యాప్తంగా 240 దేశాల్లో డిసెంబర్ 1నుంచి ఈ సిరీస్ ప్రసారం కానుంది. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ప్రసారం కానున్న ఈ సూపర్ నేచురల్ థ్రిల్లర్ సిరీస్ను 54వ అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శించారు. ఈ సందర్భంగా యూనిట్ సభ్యులందరూ ఈ వేడుకకు హాజరయ్యారు.
వీరితోపాటు కంట్రీ డైరెక్టర్, ప్రైమ్ వీడియో సుశాంత్ శ్రీరామ్, శ్రీపృథుల్కుమార్, డైరెక్టర్ ఐఫ్ఫ్ఐ, ఎండీ, ఎన్ఎఫ్డీసీ లిమిటెడ్, జాయింట్ సెక్రటరీ (ఫిలిమ్స్) సమాచార అండ్ ప్రసారమంత్రిత్వశాఖ, భారత ప్రభుత్వం, ఎంటర్టైన్మెంట్ సొసైటీ ఆఫ్ గోవా వైస్ ఛైర్మన్ శ్రీమతి డెలియా ఎం. లోబో కూడా ఈ ప్రీమియర్లో పాల్గొన్నారు. ‘ఓటీటీలో నా డెబ్యూకు ఇది పర్ఫెక్ట్ సబ్జెక్ట్.
ఇన్నాళ్లూ ఓటీటీలో గొప్ప కంటెంట్ని చూస్తూ వున్నాను. డిసెంబర్ 1 నుంచి నా కంటెంట్ చూడబోతున్నాను. ఇదో కొత్త అనుభూతి. ఎన్నో గొప్ప కథలను ప్రపంచప్రేక్షకులకు చేరువ చేస్తున్న ఓటీటీ ప్లాట్ఫామ్కి ప్రతి కళాకారుడూ కృతజ్ఞత చెప్పుకోవాలి’ అని నాగచైతన్య అన్నారు. తెలుగులో నటించాలనే నా 17ఏండ్ల ఎదురుచూపులను ‘దూత’ సిరీస్ నిజం చేసిందని పార్వతి తిరువోతు అన్నారు. ఇంకా దర్శక, నిర్మాతలు కూడా మాట్లాడారు. ప్రియాభవానీశంకర్, ప్రాచీ దేశాయ్ ప్రత్యేక పాత్రలు పోషిస్తున్న విషయం తెలిసిందే.