Custody Movie on OTT | గంపెడంత ఆశలతో థియేటర్లకు వెళ్లిన అక్కినేని ఫ్యాన్స్ ను కస్టడీ సినిమా తీవ్రంగా నిరాశపరిచింది. అప్పటికే ఏజెంట్ ఫలితంతో నిరాశలో ఉన్న అభిమానులకు దాని నుంచి కోలుకునే లోపే కస్టడీ రూపంలో మరో దెబ్బ తగిలింది. రిలీజ్ కు ముందు చేసిన హడావిడితో ఈ సినిమాపై తిరుగులేని హైప్ ఏర్పడింది. దానికి తోడు ట్రైలర్ కూడా అంచనాలు పెంచేసింది. కానీ తీరా రిలీజయ్యాక వెంకట్ ప్రభు మార్క్ కనిపించలేదు. వెంకట్ ప్రభు బలమే స్క్రీన్ ప్లే. కానీ ఈ సినిమాలో అదే మైనస్ అయింది. అయితే నాగచైతన్య మాత్రం తన నటనతో అదరగొట్టాడు. కానిస్టేబుల్ పాత్రలో ఒదిగిపోయాడు. కాగా ఈసినిమా ఓటీటీ రిలీజ్ కోసం ప్రేక్షకులు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. కాగా తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది.
ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ లో గత అర్థరాత్రి నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగుతో పాటు తమిళంలోనూ ఈ సినిమా అందుబాటులో ఉంది. సఖినేటిపల్లి పోలీస్ స్టేషనులో నాగచైతన్య ఓ కానిస్టేబుల్. అంబులెన్స్ కి దారి ఇవ్వడం కోసం ఏకంగా సీయం దాక్షాయణి (ప్రియమణి) కాన్వాయ్ ఆపి వార్తల్లోకి ఎక్కుతాడు. డ్యూటీ అంటే ప్రాణం పెడతాడు. నాగచైతన్య, కృతిశెట్టిలు ఒకరంటే ఒకరికి ఇష్టం. కులాలు వేరు కావడంతో అమ్మాయి ఇంట్లో ఒప్పుకోరు. అప్పుడే వెన్నెల కిషోర్ తో పెళ్లి నిశ్చయం చేస్తారు. దాంతో కృతిశెట్టి లేచిపోదాం అంటుంది. ఇక కృతికోసం.. చైతన్య వెళ్తుంటే దారిలో డ్రంకన్ డ్రైవ్ కేసులో అరవింద్ స్వామిని సీబీఐ ఆఫీసర్ అరెస్ట్ చేసి స్టేషనుకు తీసుకొస్తాడు. అరవింద్ స్వామిని చంపాడనికి పోలీస్ కమీషనర్ శరత్ కుమార్ సహా ఏకంగా పోలీస్ ఫోర్స్, రౌడీలు రంగంలోకి దిగుతారు. ఎందుకు అరవింద్ స్వామిని చంపాలనుకుంటారు? అసలు అరవింద్ స్వామి ఎవరు? స్టేషన్ నుంచి అరవింద్ స్వామిని తప్పించిన నాగచైతన్య బెంగళూరు ఎందుకు తీసుకు వెళ్లారు? ఈ ప్రయాణంలో అతనికి ఎదురైన సవాళ్లు ఏమిటి? ఈ కేసులో సీఎం పాత్ర ఏమిటి? ఓ సాధారణ కానిస్టేబుల్ స్టేట్ మొత్తాన్నీ ఎదుర్కొని ఓ క్రిమినల్ చావకూడదని ఎందుకు ప్రయత్నించాడు? అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది.
ఇప్పటికే ఇలాంటి కథలు బోలెడన్నీ చూసేశాం. అయినా సరే కథనం బలంగా ఉంటే ఓ సారి చూడోయ్యొచ్చు. కానీ ఈ సినిమా ముప్పై ఏళ్ల క్రితం వచ్చినా ఔట్ డేటెట్ అనే పేరునే తెచ్చుకునేది. అంతలా బోర్ కొట్టించింది. వెంకట్ ప్రభు స్క్రీన్ ప్లే మేజిక్ ఈ సినిమాలో అస్సలు వర్కవుట్ కాలేదు. పైగా చిన్న చిన్న పాత్రలకు కూడా పెద్ద స్టార్ లను పెట్టారు. యువన్ శంకర్ రాజా, ఇళయరాజా సంగీతం అందించిన ఈ సినిమాను శ్రీనివాస్ చిట్టూరి నిర్మించాడు. నాగచైతన్యకు జోడీగా కృతిశెట్టి నటించింది.