తెలుగు సినీ ఇండస్ట్రీలో క్యూట్ కపుల్ అనగానే సమంత, నాగచైతన్యల జంట గుర్తుకు వస్తుంది. ఏమాయ చేశావే సినిమాతో ఒకరి గురించి ఒకరు తెలుసుకుని, ఇష్టపడి, ప్రేమపెళ్ళి చేసుకుని హ్యాపీగా మ్యారేజ్ లైఫ్ ని ఆస్వాదించారు. కారణాలు ఏంటనవి తెలీదు గానీ ఒక్కసారిగా వారి వివాహ బంధానికి ఫుల్ స్టాప్ పెట్టారు. సోషల్ మీడియాలో వచ్చిన వార్తల్ని నిజం చేస్తూ విడాకులు తీసుకుంటున్నామంటూ తమ సోషల్ మీడియా అకౌంట్స్ లో అధికారికంగా ప్రకటించారు.
ఈ నిర్ణయంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. సెలెబ్రిటీలు సైతం ఈ నిర్ణయానికి బాధపడ్డారు. ఇక సమంత తన విడాకులు జరిగినప్పటి నుండి తన ఇన్ స్టా అకౌంట్ లో ఏదొక పోస్ట్ పెడుతూ తన బాధను వ్యక్తం చేస్తుంది. రీసెంట్ గా నాగచైతన్య ఓ ఇంటివాడు కాబోతున్నాడంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అసలు విషయానికి వస్తే.. సమంతతో విడాకులైన తర్వాత నాగచైతన్య ఒంటరిగానే ఉంటున్నారు. మరికొద్ది రోజుల్లో ఓ కొత్త ఫ్లాట్ ని తీసుకున్నట్లు తెలుస్తుంది. అక్కడ ఒంటిరిగానే ఉంటారట.
చైతన్య జూబ్లిహిల్స్ లో ఓ కాస్ట్లీ బంగ్లాను కొన్నారు. ప్రస్తుతం ఆ ఇంటికి పునరుద్దరణ పనులు జరుగుతున్నాయని అందుకే ఆ పనులు పూర్తయ్యాక చైతన్య తన ఇంటికి షిఫ్ట్ అవుతారని తెలుస్తుంది. అలా నాగచైతన్య ఓ కొత్త ఇంటికి షిఫ్ట్ అవుతున్నారు. అయితే సమంతతో కలిసి ఉండాలని భావించిన చైతూ ఇంటి కోసం కొన్ని కోట్లు ఖర్చు పెట్టాడని, చాలా రిచ్గా కట్టిస్తున్నాడని ప్రచారం జరుగుతుంది. ఇందులో నిజం ఎంత ఉందనేది తెలియల్సి ఉంది.