తేజ్ బొమ్మదేవర, రిషిక లోక్రే జంటగా సాయిరత్న క్రియేషన్స్ సంస్థ రూపొందిస్తున్న తాజా చిత్రం గురువారం హైదరాబాద్లో ప్రారంభమైంది. స్వీయ దర్శకనిర్మాణంలో బొమ్మదేవర రామచంద్రరావు తెరకెక్కిన్నారు. నాయకానాయికల మీద చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి యువ హీరో నాగచైతన్య క్లాప్నివ్వగా, ఆర్ట్ డైరెక్టర్ శ్రీనివాస్ రాజు కెమెరా స్విఛాన్ చేశారు. సముద్ర గౌరవ దర్శకత్వం వహించారు. దర్శక, నిర్మాత మాట్లాడుతూ ‘విభిన్న ప్రేమకథా చిత్రమిది. ఈ చిత్రం ద్వారా మా అబ్బాయిని హీరోగా పరిచయం చేస్తున్నాం. సెప్టెంబర్లో విడుదల చేస్తాం’ అని చెప్పారు. చిన్నతనం నుంచి తనకు నటనంటే ఇష్టమని, మంచి కథతో హీరోగా పరిచయం కావడం ఆనందంగా ఉందని తేజ్ బొమ్మదేవర చెప్పారు. జయప్రకాష్, శైలజాప్రియ, మెకా రామకృష్ణ, నవీన్నేని, రవి శివతేజ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: వాసు, సంగీతం: వికాస్ బాడిస, మాటలు: బి.సుదర్శన్, నృత్యాలు: రాజు సుందరం, రచన-దర్శకత్వం చంద్ర.