మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు. అప్పుడప్పుడు అభిమానులతో చాట్ సెషన్లో పాల్గొంటూ వారు అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు ఇస్తుంటారు. తాజాగా ఇన్స్టాగ్రామ్లో ఆస్క్ మీ ఎనీథింగ్ సెషన్ను నిర్వహించారు. ఈ సందర్భంగా నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు నాగబాబు. సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం గురించి ఓ నెటిజన్ అడగగా, అతను కోలుకుంటున్నాడు.త్వరలోనే మన ముందకు వస్తాడు అని పేర్కొన్నాడు.
మరో నెటిజన్.. బిగ్బాస్ లేదా ఐపీఎల్…ఈ రెండింట్లో ఏది ఫాలో అవుతారని ప్రశ్నించగా..’బిగ్బాస్ చూడకుండా ఐపీఎల్ చూస్తూ, నా బిడ్డ లాంటి ప్రియాంక సింగ్కి సపోర్ట్ చేస్తే ఈ సమాజం నన్ను యాక్సెప్ట్ చేస్తుందా మావా అంటూ క్రేజీగా బదులు ఇచ్చారు. దీనిపై ప్రియాంక సింగ్ టీం నాగబాబుకు ధన్యవాదాలు తెలిపారు. ‘మీరు ఎప్పుడు ఎవరిని ఊరికే సపోర్ట్ చేయరు … జెన్యూన్ పర్సన్స్ ని తప్ప, ఆ జెన్యూన్ నేచర్ మన పింకీని ఇంత వరకూ తీస్కోచ్చింది …మీకు లాగే అందరూ సపోర్ట్ చేసేలా చేస్తోంది’ అంటూ ఇన్స్టాలో పోస్ట్ చేశారు. కాగా, ప్రియాంకకి నాగబాబుతో పాటు సంజనా, పలువురు సెలబ్స్ కూడా మద్దతు ఇస్తున్న విషయం తెలిసిందే.