ఆరెంజ్ సినిమా ఓ రేంజ్ లో ఫ్లాప్ అయిన తర్వాత నిర్మాతగా, నటుడిగా చాలా డౌన్ లోకి వెళ్లిపోయాడు నాగబాబు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు కూడా. అయితే పిల్లలు గుర్తుకొచ్చి ఆగిపోయానని చెప్పాడు ఈయన. అలాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు నిలదొక్కకుని మళ్లీ నిలబడ్డాడంటే దానికి కారణం జబర్దస్త్ కామెడీ షో. ఒకటి రెండు కాదు.. ఏడేళ్ల పాటు ఈ షోలో జడ్జిగా ఉన్నాడు ఈయన. మధ్యలో తనకు తెలిసిన ఇన్ పుట్స్ ఇచ్చాడు. ఆ షో సక్సెస్ కావడానికి నాగబాబు కూడా తనవంతు బాధ్యతను నిర్వర్తించాడు. ఆ షోలో ఆయన నవ్వులకు కూడా మంచి డిమాండ్ ఉండేది. అయితే రెండేళ్ల కింద ఉన్నట్లుండి జబర్దస్త్ నుంచి బయటికి వచ్చేసాడు నాగబాబు. జీ తెలుగుకు వెళ్లి అక్కడ అదిరింది ప్రోగ్రామ్ మొదలు పెట్టాడు.
కొన్ని రోజులు బాగానే నడిచినా తర్వాత ఆగిపోయింది. అయితే జబర్దస్త్ షో నుంచి నాగబాబు ఎందుకు వెళ్లిపోయాడనేది చాలా మంది చాలా కారణాలు చెప్పారు. సింపుల్ డబ్బులు ఎక్కువిస్తున్నారు అక్కడ్నుంచి ఇక్కడికి వచ్చేసాడు.. అంతకంటే మరో కారణాలు కూడా కనిపించడం లేదు.. ఈటీవీ నుంచి ఇప్పుడు జీ టీవీకి మారిపోయాడు అంటూ చెప్పుకొచ్చారు. కానీ వెళ్లిపోయే సమయంలో మాత్రం మల్లెమాలపై చాలా సీరియస్ కామెంట్స్ చేసాడు నాగబాబు. జబర్దస్త్ కామెడీ షోను ఓ రకంగా నిందించాడు. అక్కడ పద్దతులను తప్పు పట్టాడు. పైన తెలిసి జరుగుతుందో లేదో తనకు తెలియదు కానీ చాలా తప్పులు జరుగుతున్నాయని విమర్శించాడు నాగబాబు.
ఇన్నేళ్లూ డబ్బులు తీసుకుని వెళ్ళే ముందు అలా విమర్శించడం కరెక్ట్ కాదు అంటూ నాగబాబును అప్పుడు విమర్శించిన వాళ్లు కూడా లేకపోలేదు. ఇదిలా ఉంటే ఈయన బయటకు వచ్చేయడానికి కారణం ఇప్పుడు ఆయన నోటితోనే చెప్పాడు. జబర్దస్త్ కామెడీ షోను వదిలేసి రెండేళ్లవుతున్నా కూడా ఇప్పటికీ ఈయన్ని ప్రశ్నలు మాత్రం వెంటాడటం ఆగలేదు. తాజాగా అభిమానులతో ఛాట్ చేసిన ఈయన్ని మరోసారి ఫ్యాన్స్ ఇదే ప్రశ్నలు అడిగారు. మీరెందుకు జబర్దస్త్ కామెడీ షోను వదిలేసారు సర్ అని అడిగితే మరో ఆలోచన లేకుండా ఐడియాలిజికల్ డిఫెరెన్స్ అంటూ సమాధానమిచ్చాడు. అంటే కొన్ని క్రియేటివ్ డిఫెరెన్సుల కారణంగానే బయటికి వచ్చానని క్లారిటీ ఇచ్చాడు నాగబాబు. ఆయన స్థానంలో చాలా మందిని ట్రై చేసిన తర్వాత ఇప్పుడు మనో ఫిక్సయ్యాడు.