Mysskin ‘Pisachi-2’ Teaser | విభిన్న కథలను తెరకెక్కించడంలో తమిళ డైరెక్టర్ మిష్కిన్ ముందు వరుసలో ఉంటాడు. ‘పిశాచి’, ‘డిటెక్టీవ్’ వంటి సినిమాలతో తెలుగులోనూ మంచి దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఈయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘పిశాచి-2’. 2004లో ఎలాంటి అంచనాల్లేకుండా విడుదలై తమిళంలో బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన ‘పిశాచి’ చిత్రానికి సీక్వెల్గా ఈ చిత్రం తెరకెక్కింది. హర్రర్ థ్రిల్లర్గా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని రెండేళ్ళ క్రితమే మిష్కిన్ అనౌన్స్ చేశాడు. కరోనా కారణంతో షూటింగ్ ఆలస్యమువుతూ వచ్చింది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ క్రమంలో తాజాగా చిత్ర బృందం బిగ్ అప్డేట్ను ప్రకటించింది.
ఆండ్రియా ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్ర టీజర్ డేట్ను మేకర్స్ తాజాగా ప్రకటించారు. ఏప్రిల్ 29 సాయంత్రం ‘5.00’ గంటలకు ‘పిశాచి-2’ టీజర్ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ పోస్టర్ను విడుదల చేశారు. ఈ చిత్రంపై మొదటి నుంచే ప్రేక్షకులలో అంచనాలున్నాయి. చిత్ర బృందం విడుదల చేసిన ఫస్ట్లుక్ పోస్టర్కు విశేష స్పందన వచ్చింది. పూర్ణ, రాజ్కుమార్, పిచ్చుమణిలు కీలకపాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి ఓటీటీ నుంచి భారీగా ఆఫర్స్ వచ్చినట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. కానీ చిత్ర బృందం థియేటర్లోనే సినిమా విడుదల చేయాలని భావిస్తుందట. తెలుగులో ఈ చిత్రాన్ని దిల్రాజు విడుదల చేస్తున్నాడు.