వెంకట్ కళ్యాణ్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘చెడ్డీ గ్యాంగ్ తమాషా’. గాయత్రి పటేల్ నాయికగా నటిస్తున్నది. ఈ చిత్రాన్ని అబుజా ఎంటర్టైన్మెంట్స్, శ్రీ లీల ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సీహెచ్ క్రాంతి కిరణ్ నిర్మాత. ఈ సినిమా టీజర్ను దర్శకుడు నాగ్ అశ్విన్ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ…‘ఈ చిత్ర టీజర్ బాగుంది.
ఒక సినిమాను రూపొందించి విడుదల చేయడం మనిషి పుట్టుకతో సమానం. తల్లి నవ మాసాలు మోసినట్లు ఒక టీమ్ సినిమాను తీర్చిదిద్దుతుంది. ఇక్కడికొచ్చాక నాకు నా తొలి సినిమా ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ రోజులు గుర్తొస్తున్నాయి’ అన్నారు. దర్శకుడు వెంకట్ కళ్యాణ్ మాట్లాడుతూ…‘నా పదిహేనేండ్ల కల ఈ సినిమా. పూర్తి వినోదాత్మకంగా ఈ సినిమాను రూపొందించాము. కొత్త వాళ్లు చేసిన సినిమాలా అనిపించదు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకుని సెన్సార్ సన్నాహాలు చేస్తున్నాం. త్వరలోనే చిత్రాన్ని మీ ముందుకు తీసుకొస్తాం’ అన్నారు.