Sarkaru vaari paata | దాదాపు రెండున్నరేళ్ళ తర్వాత మహేష్ ‘సర్కారువారి పాట’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించాడు. భారీ అంచనాల నడుమ మే 12న విడుదలైన ఈ చిత్రం మిక్స్డ్ రివ్యూలను తెచ్చుకుంది. కానీ కలెక్షన్లలో మాత్రం జోరు చూపిస్తుంది. మహేష్ కెరీర్లోనే హైయెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా సర్కారు వారి పాట నిలిచింది. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత మళ్ళీ ఆ స్థాయిలో ఫ్యామిలీ ఆడియెన్స్ ఈ చిత్రానికి వచ్చారు. ఈ చిత్రంలో మహేష్బాబు క్యారెక్టరైజేషన్, ఎనర్జీ గత చిత్రాలకు భిన్నంగా ఉంది. లేటెస్ట్గానే ఈ చిత్రం మూడవ వారంలోకి అడుగుపెట్టింది.
అయితే తాజాగా ‘ఎఫ్-3’ విడుదలవడంతో ఈ చిత్రానికి చాలా వరకు థియేటర్స్ తగ్గాయి. ఈ క్రమంలో చిత్రబృందం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడానికి పక్కా ప్లానింగ్తో వచ్చింది. మహేష్ అభిమానులే కాదు ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్న ‘మురారి బావ’ మెలోడియస్ పాటను శనివారం యాడ్ చేయనున్నారు. నిడివి కారణంగా ఈ పాటను మేకర్స్ ఎడిటింగ్లో తీసేసిన విషయం తెలిసిందే. పరశురాం దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మహేష్కు జోడీగా కీర్తి సురేష్ హీరోయిన్గా నటించింది. థమన్ సంగీతం అందించాడు. 14రీల్స్ ఎంటర్టైనమెంట్స్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లతో కలిసి మహేష్ స్వీయ నిర్మాణంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.