Sanya Malhotra | దేశ రాజధాని కంటే ముంబైలోనే మహిళలకు రక్షణ ఉంటుందని బాలీవుడ్ కథా నాయిక సాన్యా మల్హోత్రా అభిప్రాయ పడ్డారు. ఆమె హీరోయిన్గా నటించిన హిట్ సినిమా ప్రచారంలో భాగంగా ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. తాను ఢిల్లీ వాసినని, కానీ, ముంబైలోనే తాను చాలా సురక్షితంగా ఉంటానని భావిస్తానన్నారు. ముంబై నగరంలోనే భద్రత ఎక్కువగా ఉంటుందన్నారు.
తాను ఢిల్లీ వాసినైనా ముంబైలోనే సురక్షితమని భావిస్తానని సాన్యా మల్హోత్రా చెప్పారు. దేశ రాజధాని ఢిల్లీ అభివృద్ధి సంగతి తనకు తెలియదు గానీ, అక్కడ సేఫ్టీ లేదన్నారు. ఢిల్లీలో ఒక్క మహిళ కూడా ఆకతాయిల వేధింపులకు గురి కాలేదని తాను అనుకోవడం లేదని అన్నారు.
విశ్వక్సేన్ హీరోగా తెలుగులో హిట్ సాధించిన సినిమా `హిట్`ను హిందీలోనూ అదే పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమా శుక్రవారం (జూలై 15) నాడు విడుదల కానున్నది. అమీర్ఖాన్ హీరోగా నటించిన `దంగల్` చిత్రంతో సాన్యా మల్హోత్రా తెరంగ్రేటం చేశారు.