Mrunal Thakur | ‘సీతారామం’ చిత్రం కథానాయిక మృణాల్ ఠాకూర్ కెరీర్కు గొప్ప మలుపునిచ్చింది. గత ఏడాది విడుదలైన ‘నాన్న’ చిత్రంలో కూడా అభినయ ప్రధాన పాత్రలో ఆకట్టుకుందీ భామ. ప్రస్తుతం ఆమె విజయ్ దేవరకొండ సరసన ‘ఫ్యామిలీ స్టార్’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. తెలుగులో ఈ అమ్మడు నటించిన చిత్రాలు మంచి విజయాలు సాధించడంతో అభిమానులు అదృష్టనాయిక అంటూ అభివర్ణిస్తున్నారు.
ఈ నేపథ్యంలో మృణాల్ ఠాకూర్కు తమిళం నుంచి కూడా భారీ అవకాశాలొస్తున్నాయి. ఇప్పటికే శివకార్తికేయన్, శింబు చిత్రాల్లో నాయికగా అవకాశాల్ని దక్కించుకున్న ఈ భామ అగ్ర హీరో అజిత్ సరసన కథానాయికగా నటించబోతున్నట్లు తెలిసింది. అదిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో అజిత్ ఓ సినిమా చేయబోతున్నారు. భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ సినిమాలో పలువురు అగ్ర నాయికల పేర్లు తెరపైకొచ్చాయి. తాజాగా ఆ ఛాన్స్ మృణాల్ ఠాకూర్ దక్కించుకుందని సమాచారం. తమిళంలో ఇప్పటివరకు ఒక్క సినిమా విడుదల కాకముందే భారీ అవకాశాలను దక్కించుకుంటూ సంచలనం సృష్టిస్తున్నది మృణాల్ ఠాకూర్. ఆమె తాజా తెలుగు చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ ఏప్రిల్ 5న రిలీజ్ కానుంది.