స్వీయ నిర్మాణంలో టీఎన్ఆర్ (టి.నరసింహా రెడ్డి) హీరోగా నటిస్తూ నిర్మించిన చిత్రం ‘మిస్టర్ రెడ్డి’. వెంకట్ వోలాద్రి దర్శకుడు. ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకురానుంది. సోమవారం ప్రీరిలీజ్ ఈవెంట్ను నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో, నిర్మాత టీఎన్ఆర్ మాట్లాడుతూ..తన జీవితంలో జరిగిన ప్రేమకథ ఇదని చెప్పారు.
ఈ లవ్స్టోరీ చాలా కొత్తగా ఉంటుందని, భావోద్వేగాలతో పాటు వినోదప్రధానంగా మెప్పిస్తుందని దర్శకుడు వెంకట్ వోలాద్రి పేర్కొన్నారు. మహాదేవ్, అనుపమప్రకాష్, దీప్తి శ్రీరంగం, భాస్కర్, మల్లికార్జున్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: కె.ఎన్.భూషణ్, సంగీతం: కేఎస్ఆర్ మ్యూజికల్, రచన-దర్శకత్వం: వెంకట్ రెడ్డి వోలాద్రి.