ప్రముఖ నటి, దర్శకురాలు, దివంగత విజయనిర్మల మనవడు శరణ్కుమార్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘మిస్టర్ కింగ్’. శశిధర్ చావలి దర్శకుడు. బి.ఎన్.రావు నిర్మించారు. ఈ నెల 24న విడుదలకానుంది. శనివారం ట్రైలర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి సీనియర్ నటుడు నరేష్, నిర్మాత ఎం.ఎస్.రాజు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. దర్శకుడు మాట్లాడుతూ ‘ఆత్మాభిమానం ఉన్న ఓ అబ్బాయి కథ ఇది. ైక్లెమాక్స్ ఘట్టాలు హృద్యంగా ఉంటాయి. థియేటర్ నుంచి ప్రతి ఒక్కరూ చిరునవ్వుతో బయటకొస్తారు’ అని చెప్పారు. ఏడాది పాటు పరిశోధన చేసి దర్శకుడు ఈ కథను సిద్ధం చేశారని, ప్రతి ఒక్కరిని మెప్పిస్తుందని నిర్మాత బి.ఎన్.రావు తెలిపారు. ఇదొక కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని ..లక్ష్యసాధన కోసం హీరో ఏం చేశాడన్నది ఆసక్తిని పంచుతుందని కథానాయకుడు శరణ్ తెలిపారు. కుటుంబమంతా కలిసి చూసే చిత్రమిదని కథానాయిక ఊర్విసింగ్ పేర్కొంది.