నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మదర్ థెరిసా మన దేశంలో చేసిన సేవలను కథాంశంగా ఎంచుకుని రూపొందిన సినిమా ‘మదర్ థెరిసా అండ్ మీ’. బనితా సంధు, జాక్వెలిన్ ఫ్రిట్షి – కోర్నాజ్, దీప్తి నావల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని కర్రీ వెస్ట్రన్ మూవీస్, లెస్ ఫిల్మ్స్ డు లోటస్, కవితా థెరిసా ఫిల్మ్స్ నిర్మిస్తున్నాయి. కమల్ ముసలే దర్శకత్వం వహించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని మే 5న విడుదల చేయబోతున్నారు.