మానవ సంబంధాల్ని కొత్త కోణంలో ఆవిష్కరించే చిత్రమిది. ప్రతి జంటకు తమ జీవితంలో జరిగిన సంఘటనల్ని గుర్తుకు తెస్తుంది’ అని అన్నారు అఖిల్. ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు, వాసువర్మ నిర్మిస్తున్నారు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకుడు. ఈ నెల 15న విడుదలకానుంది. గురువారం హైదరాబాద్లో ట్రైలర్ను విడుదలచేశారు. ఈ సందర్భంగా అఖిల్ మాట్లాడుతూ ‘ప్రేమ, పెళ్లి విషయంలో ఉండే అపోహల్ని తొలగిస్తూ కనువిప్పు కలిగించే చిత్రమిది. నాకు, పూజాహెగ్డేకు మధ్య వచ్చే కామెడీ అలరిస్తుంది’ అని తెలిపారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ ‘భారతీయ సినీ పరిశ్రమకు టాలీవుడ్ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నది. మంచి కథ చెబితే ప్రేక్షకులు థియేటర్స్కు వస్తారని తెలుగు సినిమాలు నిరూపిస్తున్నాయి. సినీ పరిశ్రమ అనేక ఇబ్బందుల్లో ఉంది. థియేటర్స్ పరంగా ఏపీలో ఉన్న సమస్యల్ని పరిష్కరించాలని సీఏం జగన్ను కోరుతున్నా’ అని పేర్కొన్నారు. పెళ్లికి ముందు, పెళ్లి తర్వాత జీవితాల్లో వచ్చే మార్పులేమిటనే పాయింట్కు వినోదం, ఉద్వేగాల్ని జోడిస్తూ తెరకెక్కించిన చిత్రమిదని నిర్మాతలు అన్నారు. కొత్త కంటెంట్తో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు నవ్యానుభూతిని పంచుతుందని దర్శకుడు చెప్పారు.