అక్కినేని అఖిల్.. అఖిల్ చిత్రంతో హీరోగా వెండితెర ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత అఖిల్ చేసిన చిత్రాలు అన్నీ ఫ్లాప్ అయ్యాయి. దీంతో ఆయన తాజాగా నటించిన మోస్ట్ ఎలిజిబుల్ చిత్రంపై భారీ హోప్స్ పెట్టుకున్నాడు. రొమాంటిక్ కామెడీగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నాడు. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్ మీద బన్నీవాస్, దర్శకుడు వాసు వర్మ కలిసి నిర్మిస్తున్నారు.
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రంలో అఖిల్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుంది.ఇద్దరికి సంబంధించి కొన్ని ప్రచార చిత్రాలు విడుదల కాగా, ఇవి నెటిజన్స్ ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సినిమాను జూన్ రెండో వారంలో రిలీజ్ చేద్దామని అనుకున్నారు. కానీ, కరోనా వైరస్ ప్రభావం వలన వాయిదా పడుతూ వచ్చింది. ఓటీటీలోనే చిత్రం విడుదల అవుతుందని జోరుగా ప్రచారం జరగగా, మేకర్స్ కొద్ది సేపటి క్రితం క్రేజీ అప్డేట్ ఇచ్చారు.
అక్టోబర్ 8న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రాన్ని థియేటర్స్లో విడుదల చేయనున్నట్టు ప్రకటించారు మేకర్స్. దీంతో అక్కినేని అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఇప్పటి వరకు టీజర్, సాంగ్ తప్ప ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ కూడా లేదు. ప్రేమ, కుటుంబకథా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాలో అఖిల్ సరసన పూజాహెగ్డే నటించారు. యువతరానికి నచ్చే అంశాలు, కుటుంబ భావోద్వేగాల మేళవింపుగా ఈ చిత్రాన్ని రూపొందించారు. బ్యాచ్లర్గా అఖిల్ చేసే సందడి ఆకట్టుకుంటుందని సినీ వర్గాలు చెబుతున్నాయి.