మోహన్ కృష్ణ, సౌజన్య, హరిణి రెడ్డి ముఖ్యతారలుగా రూపొందుతున్న చిత్రం ‘మోహనకృష్ణ గ్యాంగ్లీడర్’. శ్రీలక్ష్మణ్ దర్శకుడు. సింగలూరి మోహనరావు నిర్మాత. వచ్చే నెల 7న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇటీవల చిత్రబృందం పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసింది. దర్శకుడు మాట్లాడుతూ ‘రైతు గొప్పదనం చాటిచెప్పే విధంగా మంచి కాన్సెప్ట్ తీసుకుని తెరకెక్కించిన సినిమా ఇది. సందేశంతో పాటు కమర్షియల్ అంశాలు కూడా వున్నాయి’ అన్నారు. ఈ సమావేశంలో చిత్ర యూనిట్తో పాటు నటుడు సుమన్, ప్రతాని రామకృష్ణ గౌడ్, ప్రసన్నకుమార్, తుమ్మల పల్లి రామసత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.