Mohan Babu | జర్నలిస్ట్పై దాడి కేసులో ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు (Mohan Babu)కు సుప్రీంకోర్టు (Supreme Court)లో ఊరట లభించింది. ఈ కేసులో మోహన్బాబుకి సుప్రీంకోర్టు గురువారం ముందస్తు బెయిల్ను మంజూరు చేసింది.
గత ఏడాది డిసెంబరు 10న జల్పల్లిలోని మోహన్ బాబు నివాసం వద్ద మీడియా ప్రతినిధిపై దాడి చేయడంపై పహాడీషరీఫ్ పోలీసులు మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. దీనిపై నమోదైన కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ మోహన్బాబు దాఖలు చేసిన పిటిషన్ను తెలంగాణ హైకోర్టు గత ఏడాది డిసెంబరు 23న కొట్టివేసింది. ఈ ఉత్తర్వులను సవాల్చేస్తూ ఆయన సుప్రీకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ కేసును నేడు విచారించిన న్యాయస్థానం మోహన్ బాబుకి ముందస్తు బెయిల్ని ముంజూర్ చేసింది.
ఈ దాడి ఘటనలో గాయపడ్డ జర్నలిస్ట్కు మోహన్ బాబు క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు ఓ లేఖ కూడా విడుదల చేశారు. ఈ ఘటనలో ఓ జర్నలిస్ట్ సోదరుడు గాయపడటం నాకు బాధ కలిగించింది. ఈ ఘటన తర్వాత అనారోగ్యం కారణంగా 48 గంటల పాటు ఆసుపత్రిలో చేరడంతో వెంటనే స్పందించలేకపోయా. ఆ రోజు నా ఇంటిగేటు విగిరిపోయింది.. దాదాపు 30 నుంచి 50 మంది వ్యక్తులు ఇంట్లోకి చొచ్చుకొచ్చారని.. ఆ సమయంలో సహనాన్ని కోల్పోయినట్లు లేఖలో వివరించారు.
పరిస్థితి అదుపు చేసే క్రమంలో జర్నలిస్ట్కు గాయమైందని.. ఇది చాలా దురదృష్టకరమన్నారు. అతడికి, ఆయన కుటుంబానికి కలిగిన బాధకు తాను తీవ్రంగా చింతిస్తున్నట్లు చెప్పారు. గాయపడ్డ జర్నలిస్ట్ త్వరగా కోలుకోవాలని మోహన్బాబు కాంక్షించారు.