ఓటీటీ రంగంలో టాక్ షోలను తీసుకొచ్చిన సంస్థగా ఆహా(aha) ప్రత్యేకతను చాటుకుంటోంది. ఇప్పటికే సమంతతో సామ్ జామ్ అనే షోను నిర్వహించిన ఆహా.. ఈసారి ఏకంగా నందమూరి బాలకృష్ణను రంగంలోకి దింపుతున్నారు సినిమాల్లో పవర్ ఫుల్ డైలాగ్స్తో అదరగొట్టే బాలయ్య(Bala Krishna) బుల్లితెరపై తొలిసారిగా యాంకర్గా వస్తుండటంతో నందమూరి అభిమానుల్లో ఆసక్తిగా నెలకొంది. నవంబర్ 4 నుంచి ప్రసారం కానున్న తొలి ఎపిసోడ్లో బాలకృష్ణ ఎవరిని ఇంటర్వ్యూ చేయనున్నారు అనే దానిపై కొద్ది రోజులుగా చర్చ నడుస్తుంది.
తాజాగా ఆహా టీం గెస్ట్ వివరాలను ప్రకటించింది. డైలాగ్ కింగ్ ఫ్యామిలీ మోహన్ బాబు(Mohan babu), మంచు విష్ణు,మంచు లక్ష్మీలను ఇంటర్వ్యూ చేసినట్టు పోస్టర్ ద్వారా తెలియజేశారు. ఇందులో బాలయ్య లుక్ అదిరిపోయింది. మరి కొద్ది గంటలలో ప్రోమో రానుంది. ఇందులో బాలయ్య విశ్వరూపం సాక్షత్కారం కానుంది. వెండితెరపై అదరగొట్టిన బాలయ్య బుల్లితెరపై ఎలాంటి సందడి చేస్తాడో చూడాలి. ఇక నవంబర్ 4వ తేది నుంచి ప్రసారం కానున్న ఈ షో మొత్తం 12 ఎపిసోడ్లుగా స్ట్రీమింగ్ కానుంది. ఈ షో లోకి ప్రత్యేక గెస్ట్ లుగా సినీ పరిశ్రమకి చెందిన వారు రానున్నారు.