Ilayaraja Daughter | ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా కుమార్తె, గాయని భవతరణి (47) ఇటీవల కన్నుమూసిన విషయం తెలిసిందే. కొంతకాలంగా లివర్ క్యాన్సర్తో బాధపడుతున్న భవతరణి శ్రీలంకలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పోందుతుంది. అయితే తన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో జనవరి 25న తుది శ్వాస విడిచింది. ఇక భవతరణి మృతి పట్ల సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు, ఇళయరాజా అభిమానులు ఆమెకు సంతాపం ప్రకటించారు. ఇక కూతురు పోయిందన్న బాధలో ఉన్న ఇళయరాజాను సినీ ప్రముఖులు కలిసి ఓదార్చుతున్నారు.
తాజాగా టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు కూడా సతీసమేతంగా వెళ్లి ఇళయరాజాను పరామర్శించి ధైర్యం చెప్పారు. భవతారణి ఇక లేదు అనే వార్త వినగానే నా హృదయం ముక్కలైంది. కుమార్తె మరణంతో విషాదంలో మునిగిపోయిన ఇళయరాజాకు అతని కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఈ విషాద పరిస్థితులను తట్టుకునే శక్తిని ఇళయరాజాకు అతని కుటుంబానికి ఆ భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను అంటూ మోహన్ బాబు రాసుకోచ్చాడు.
Upon hearing the heartbreaking news, I visited @ilaiyaraaja garu to convey my deepest condolences to him and his family on the tragic loss of his daughter Bhavatharini.
I pray that the almighty gives his family the strength to withstand this tragic moment. pic.twitter.com/3DxTCyYEE5
— Mohan Babu M (@themohanbabu) January 30, 2024