Mogilaiah | భీమ్లా నాయక్ సినిమాలో ‘లా లా భీమ్లా’ అంటూ సాగే పాట ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికే ఈ పాట యూట్యుబ్ లో నాలుగు కోట్ల వ్యూస్ ను సొంతం చేసుకుంది. ఈ పాటలో ‘ఆడ గాదు ఈడ గాదు’ అంటూ వచ్చే పల్లవి భీమ్లా పాటకి ప్రాణం పోసిందని చెప్పాలి.ఇక ఈ పల్లవిని కిన్నెర సాని మొగిలయ్య ఆలపించాడు. ఈ పాటతో ఈయన క్రేజ్ అమాంతంగా పెరిగింది. కాగా తాజాగా ఈయన కేంద్ర ప్రభుత్వం నుండి పద్మశ్రీ అవార్డు పొందాడు. ఇదిలా ఉంటే తాజాగా ఈయన మరో స్టార్ హీరో సినిమాలో పాట పాడుతున్నట్టు సమాచారం.
సినీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త ప్రకారం ఈయనకి జూ.ఎన్టీఆర్ సినిమాలో ఒక పాట పాడే అవకాశం వచ్చిందని సమాచారం. కాగా జూ.ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇక ఇందులో మొగిలయ్యతో ఒక పాట పాడించాలని చిత్ర బృందం అనుకుంటుందని టాక్ . ఇందులో నిజమెంతుందో తెలియాలంటే అధికారికంగా ప్రకటన రావాల్సిందే. ఇక ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్ సమర్పణలో యువసుధ ఆర్ట్స్ బ్యానర్ పై సుధాకర్ మిక్కిలినేని నిర్మిస్తున్నాడు. అనిరుధ్ రవిచంద్రన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు.