Mission Raniganj | బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ (Akshay Kumar) ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం మిషన్ రాణిగంజ్(Mission Raniganj). ది గ్రేట్ భారత్ రెస్క్యూ అనేది ఉప శీర్షిక (The Great Bharat Rescue). బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా (parinithi chopra) కథానాయికగా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇదిలా ఉండగా.. ఈ మూవీ నుంచి మేకర్స్ ట్రైలర్ విడుదల చేశారు.
1989 నవంబర్ 13న పశ్చిమ బెంగాల్లోని రాణిగంజ్ అనే మైనింగ్ ఏరియాలో ఉన్న బొగ్గు గనుల్లో 64 మంది కార్మికులు చిక్కుకుంటారు. బొగ్గు గనుల్లో చిక్కుకున్న కార్మికులను కాపాడే.. మైనింగ్ ఇంజనీర్ పాత్రలో అక్షయ్ కుమార్ (Akshya Kumar) కనిపించనున్నాడు. వారిని కాపాడడానికి అక్షయ్ ఏం చేశాడు అనేది ట్రైలర్లో చూడవచ్చు. ఇక ఈ ట్రైలర్ గమనిస్తే.. స్టోరీ మొత్తం ట్రైలర్లోనే చెప్పినట్లుగా కనిపిస్తుంది.
Sardar Jaswant Singh Gill ji, eh trailer twahdi yaad vich twahdi bahaduri nu samarpit hai. 🙏 In your memory, saluting your courage. Rab rakha. #MissionRaniganjTrailer out now: https://t.co/0JzSfW57F4#MissionRaniganj in cinemas on 6th October. pic.twitter.com/NE4hx6uWA1
— Akshay Kumar (@akshaykumar) September 25, 2023
జస్వంత్ సింగ్ గిల్ (Jaswanth Singh gill) అనే మైనింగ్ ఇంజనీర్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రానుండగా.. ఈ మూవీ షూటింగ్ పూర్తిచేసుకుని.. ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్స్ పనుల్లో బీజిగా ఉంది. ఇక ఈ సినిమాను అక్టోబర్ 06న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.
ఇక కేసరి (Kesari) వంటి బ్లాక్ బస్టర్ చిత్రం తరువాత అక్షయ్, పరిణీతి మళ్లీ కలిసి నటిస్తుండడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. కాగా ఈ చిత్రానికి టిను సురేష్ దేశాయ్ (Tinu Suresh Deshayi) దర్శకత్వం వహిస్తుండగా.. పూజా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై వశ్ భగ్నానీ నిర్మిస్తున్నాడు