ఈ మధ్య కేటుగాళ్లు కాస్త అప్డేట్ అయ్యారు. సామాన్య ప్రజలనే కాక బడా బాబులని సైతం బురిడీ కొట్టిస్తున్నారు. రీసెంట్గా నిర్మాత సురేష్ బాబు వ్యాక్సినేషన్ విషయంలో మోసపోయి లక్ష రూపాయలు పోగొట్టుకున్నాడు. ఇక తాజాగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ, సినీ నటి మిమి చక్రవర్తి.. నకిలీ మనిషి విషయంలో బోల్తా పడింది. తాను ఐఏఎస్ అంటూ టీకా వేయించాడని మిమి పోలీసులకి తెలియజేసింది.
వివరాలలోకి వెళితే, ఓ వ్యక్తి తనను తాను ఐఏఎస్ అని చెప్పి, ట్రాన్స్జెండర్ల కోసం ప్రత్యేకంగా టీకా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దానికి మీ సహకారం కావాలని కోరాడు. అతనితో పాటు కొందరు అధికారులు, భద్రతా సిబ్బంది లాంటి వారు ఉన్నారు. దీంతో నిజంగా అతను ఐఏఎస్ అని మోసపోయాను. టీకా వేయించుకున్నాక ఎంత సేపటికి కొవిన్ నుంచి ధ్రువీకరణ సందేశం రాలేదు. వెంటనే కోల్కతా పోలీసులను సంప్రదించాను” అని అన్నారు మిమి చక్రవర్తి.
మిమి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని పోలీసులు పట్టుకొని అతడి వద్ద నుంచి కారుకు ఉపయోగించిన నకిలీ స్టిక్కర్లు, నీలిరంగు బేకాన్ను స్వాధీనం చేసుకున్నారు.