సందీప్ కిషన్ (Sundeep Kishan)-విజయ్ సేతుపతి కాంబోలో వస్తున్న చిత్రం మైఖేల్. గౌతమ్వ వాసుదేవ్ మీనన్, వరుణ్ సందేశ్, విజయ్ సేతుపతి, దివ్యాంక కౌశిక్, అనసూయ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రంజిత్ జయకోడి దర్శకత్వం వహిస్తున్న మైఖేల్ ఫిబ్రవరి 3న థియేటర్లలో గ్రాండ్గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో రంజిత్ జయకోడి మీడియాతో చిట్ చాట్ చేశాడు. మైఖేల్ విశేషాలు డైరెక్టర్ మాటల్లోనే..
మైఖేల్ ప్రయాణం ఎలా మొదలైంది.. ?
నా రెండో సినిమా చూసిన తర్వాత సందీప్ కిషన్ ఫోన్ చేశాడు. నా వర్క్ ఆయనకు చాలా బాగా నచ్చింది. ఇద్దరం మంచి ఫ్రెండ్స్ అయ్యాం. లాక్డౌన్ సమయంలో మేమిద్దరం చాలా విషయాలు షేర్ చేసుకున్నాం. సెకండ్ లాక్డౌన్లో మనిద్దరం కలిసి సినిమా చేయాలన్నాడు. సందీప్ కిషన్ యాక్షన్ సినిమా చేయాలనుకున్నాడు. అదే సమయంలో నేను కూడా యాక్షన్ స్టోరీని వినిపించా.. అలా మా ప్రయాణం మొదలైంది.
మైఖేల్ గ్యాంగ్స్టర్ స్టోరీనా..?
మైఖేల్ ఒక జోనర్లో ఉంటుందని చెప్పలేము. ఇది రొమాంటిక్, యాక్షన్, గ్యాంగ్స్టర్ డ్రామా, పీరియాడిక్ సినిమా అనొచ్చు. 70స్,80స్,90స్ల కాలంలో ఉండగా.. సినిమా ఎక్కువగా 90స్ బ్యాక్ డ్రాప్లో ఉంటుంది. గ్యాంగ్ స్టర్ కథాంశంతో సాగే లవ్స్టోరీగా చాలా ఎక్జయిటింగ్గా ఉండబోతుంది.
విజయ్ సేతుపతి ఎలా ఒకే చేశారు..?
నాకు ఆయన మంచి స్నేహితుడు. ఆయనతోనే నా మొదటి సినిమా చేశా. కథానుగుణంగా పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న నటుడు కావాలి. అందుకే ఆయనకు కథ వినిపించగానే నచ్చేసింది. ఆయన సర్ప్రైజింగ్గా ఫీలయ్యారు. ప్రేక్షకులు కూడా అలాగే థ్రిల్ అవుతారు.
సందీప్ కిషన్తో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ గురించి..
చాలా కాలంగా సందీప్ కిషన్ తెలుసు. నాకు ఏం కావాలో సులభంగా అర్థం చేసుకుంటాడు. కథను కూడా చాలా బాగా అర్థం చేసుకుంటాడు. ఆయనతో పనిచేయడం నాకు అద్బుతమైన అనుభవం.
మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్ల గురించి..
మైఖేల్ తర్వాత నా చేతిలో రెండు సినిమాలున్నాయి. యువసుధ ఆర్ట్స్ బ్యానర్లో సంతకం చేశా. కరణ్ సీ నిర్మించబోయే సినిమాకు కూడా సైన్ చేశా.