నేటి మహిళలు సమాజంలో ఎదుర్కొంటున్న సమస్యలు మా ‘అశ్మీ’సినిమాలో చూపిస్తున్నాం. అన్ని కమర్షియల్ అంశాలతో పాటు సమాజానికి మంచి సందేశాన్ని కూడా ఈ చిత్రం ద్వారా అందిస్తున్నాం. తప్పకుండా చిత్రం కథానాయికగా నాకు మంచి పేరును తీసుకవస్తుంది’ అన్నారు. నాయిక రుషికా రాజ్. ఆమె కథానాయికగా శేష్ కార్తికేయ దర్శకత్వంలో స్నేహా రాకేష్ నిర్మిస్తున్న చిత్రం ‘అశ్మీ’ త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈసందర్భంగా రుషికా రాజ్ మాట్లాడుతూ ‘కన్నడలో మూడు సినిమాలు చేసిన నాకు ఈ చిత్రం కథానాయికగా మంచి పేరు తెస్తుంది. కెరీర్ ప్రారంభం నుంచి సమాజానికి మంచి సందేశం వుండే సినిమాలో నటించాలనే నా కోరిక ఈ చిత్రంతో తీరుతుంది’ అన్నారు.