కొద్ది మాసాల క్రితం వివాహ నిశ్చితార్థం జరుపుకొని సినిమాలకు విరామాన్ని ప్రకటించింది పంజాబీ సుందరి మెహరీన్. తాజాగా ఈ అమ్మడు హైదరాబాద్లో జరుగుతున్న షూటింగ్లో సందడి చేస్తోంది. దర్శకుడు మారుతి కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వ పర్యవేక్షణ చేస్తూ పరిమిత బడ్జెట్లో ఓ సినిమా చేస్తున్నారు. వినూత్న కథాంశంతో రూపొందిస్తున్న ఈ చిత్రంలో సంతోష్శోభన్, మెహరీన్ జంటగా నటిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో చిత్రీకరణ జరుగుతోంది. తక్కువ వ్యయంతో తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో అతి కొద్దిమంది యూనిట్ సభ్యులతో రాష్ట్ర ప్రభుత్వ కొవిడ్, లాక్డౌన్ నిబంధనలకు అనుగుణంగా షూటింగ్ను చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ విరామంలో యూనిట్ సభ్యులతో సరదాగా తీయించుకున్న ఓ వీడియోను మెహరీన్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. నెలరోజుల్లో ఈ సినిమాను పూర్తిచేసే ఆలోచనలో చిత్ర బృందం ఉందని తెలిసింది. ప్రస్తుతం మెహరీన్ తెలుగులో ‘ఎఫ్-3’ చిత్రంలో నటిస్తోంది. వెంకటేష్, వరుణ్తేజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు.