టాలీవుడ్ ముద్దుగుమ్మ మెహ్రీన్ కౌర్ కొద్ది రోజుల క్రితం భవ్య అనే వ్యక్తితో నిశ్చితార్థం జరుపుకున్న విషయం తెలిసిందే. పెళ్లి కోసం ప్లాన్ చేసుకుంటున్న నేపథ్యంలో లాక్డౌన్ అనౌన్స్ చేయడంతో పెళ్లి పోస్ట్ పోన్ అయింది. పరిస్థితులన్నీ చక్కబడ్డాక పెళ్లి చేసుకుంటామని మెహ్రీన్ పేర్కొనడంతో దర్శకనిర్మాతలు ఆమె డేట్స్ కోసం క్యూ కడుతున్నారు. తాజాగా బాలకృష్ణ- గోపీచంద్ మలినేని కాంబోలో రూపొందుతున్న సినిమా కోసం ఈ అమ్మడిని సంప్రదించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
ముందుగా ఈ సినిమా కోసం శృతి హాసన్, త్రిష లాంటి హీరోయిన్స్ అనుకున్నా.. అది కుదరకపోవడంతో మెహ్రీన్కి ఆ ఆఫర్ ఇచ్చారట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది. ప్రస్తుతం మెహ్రీన్ ‘ఎఫ్ 3’ సినిమాలో నటిస్తోంది. అలాగే రీసెంట్గా మారుతి-సంతోష్ శోభన్ సినిమా ఒప్పుకుంది. ఇక ఇప్పుడు బాలయ్య సరసన నటించే అవకాశం రావడంతో ఈ అమ్మడు ఓకే చేసినట్లు సమాచారం. ఈ రోల్ కోసం రెమ్మ్యూనరేషన్ కూడా బాగానే ఆఫర్ చేశారని తెలుస్తోంది.