రాహుల్ విజయ్, మేఘా ఆకాష్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం తొంభైశాతం చిత్రీకరణ పూర్తిచేసుకుంది. ఈ చిత్రం ద్వారా అభిమన్యు బద్ది దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఎ.సుశాంత్రెడ్డి, అభిషేక్ కోట నిర్మాతలు. మేఘా ఆకాష్ తల్లి బిందు ఆకాష్ సమర్పిస్తున్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘గోవా నేపథ్యంలో రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూపొందిస్తున్నాం. ఇటీవల గోవాలో ముగిసిన షెడ్యూల్లో ప్రధాన తారాగణంపై కీలక ఘట్టాలను తెరకెక్కించాం. వినూత్న ప్రేమకథా చిత్రమిది. ప్రేమికుల జీవితంలో చోటుచేసుకునే సంఘటనలు, మలుపులు ఉత్కంఠను పంచుతాయి’ అని చెప్పారు. రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, అభయ్, వైవా హర్ష తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: మనోజ్ రెడ్డి.