చిరంజీవి, రామ్చరణ్ కథానాయకులుగా నటిస్తున్న ‘ఆచార్య’ చిత్రాన్ని ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఏప్రిల్ 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై నిరంజన్రెడ్డి, అన్వేష్రెడ్డి నిర్మించారు. నిర్మాతలు మాట్లాడుతూ ‘తొలుత ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 4న విడుదల చేయాలని సన్నాహాలు చేశాం. ప్రస్తుతం కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో సినిమాను విడుదల చేయడం శ్రేయస్కరం కాదనిపించింది. అందుకే ఏప్రిల్ 1న ప్రేక్షకులముందుకు రాబోతున్నాం. సామాజిక సందేశంతో ప్రేక్షకులందరిని ఆకట్టుకునే చిత్రమిది’ అన్నారు.