Pakka Commercial Pre-Release Event | టాలీవుడ్ మ్యాచోస్టార్ గోపిచంద్ ప్రస్తుతం వరుసగా సినిమాలను చేస్తూ బిజీగా గడుపుతున్నాడు. చాలా కాలం తర్వాత ‘సీటీమార్’తో మంచి కంబ్యాక్ ఇచ్చాడు. కమర్షియల్గా ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ప్రస్తుతం ఈయన నటించిన ‘పక్కా కమర్షియల్’ విడుదలకు సిద్ధంగా ఉంది. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మారుతి దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలే ఉన్నాయి. ఇటీవలే విడుదలైన ట్రైలర్కు మంచి స్పందన వచ్చింది. యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం జూలై 1న విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్రబృందం వరుస అప్డేట్లను ప్రకటిస్తూ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మరో వార్త నెట్టింట వైరల్గా మారింది.
‘పక్కా కమర్షియల్’ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ జూన్ 26న హైదరాబాద్లో జరుగనుంది. కాగా ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి గెస్ట్గా రాబోతున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో సమాచారం. ఈ చిత్రంలో గోపిచంద్ సరసన రాశీఖన్నా హీరోయిన్గా నటించింది. సత్యరాజ్, శ్రీనివాస్ రెడ్డి, అనసూయ, రావురమేష్ కీలకపత్రల్లో నటించారు. యూవీ క్రయేషన్స్, జీఎ2 పిక్చర్స్ బ్యానర్లపై బన్నివాస్, వంశీ, ప్రమోద్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. జేక్స్ బేజోయ్ సంగీతం అందించాడు.