మెగాస్టార్ చిరంజీవి వరసపెట్టి సినిమాలు చేస్తున్నాడు. ఆయన సీనియర్ దర్శకులతోనే కాక కుర్ర డైరెక్టర్స్తోను మూవీస్ చేసేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో బాబీతో క్రేజీ ప్రాజెక్ట్ చేయబోతున్నాడు. వెంకీమామ హిట్టుతో అందరినీ ఆకట్టుకున్నాడు బాబీ. ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ చిరంజీవితోనే సినిమాను తీస్తున్నాడు. మెగాస్టార్ చిరంజీవి 154వ ప్రాజెక్ట్గా రాబోతోన్న ఈ మూవీ గత నెలలోనే లాంఛనంగా ప్రారంభమైంది.
తాజాగా ఈ సినిమా షూటింగ్ను ప్రారంభించారు. మొదటి రోజు సెట్లో చిరంజీవి మీద సీన్స్ తెరకెక్కించారు. సినిమా సెట్లోని స్టిల్స్తో మైత్రీ మూవీస్, డైరెక్టర్ బాబీ ఓ ఫోటోను షేర్ చేశారు. ఇది నాకు ఎంతో థ్రిల్లింగ్గా అనిపించిన రోజు.. ఒకేసారి ఎంతో సంతోషంగా ఉంది.. నర్వస్గా కూడా ఉంది.. మొదటి రోజు సెట్లో చిరంజీవి గారు జాయిన్ అయ్యారు. ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తున్న ఈ కొత్త ప్రయాణం గొప్పగా మొదలైంది. మీ అందరి ఆశీర్వాదం కావాలని బాబీ పోస్ట్ చేశాడు.
వాల్తేర్ వీరయ్య అనే టైటిల్ పరిశీలనలో ఉందని తెలుస్తోంది. ఈ మూవీకి సంబంధించిన ఇతర కాస్టింగ్ విషయాలను మాత్రం ఇంకా వెల్లడించలేదు. ‘ఆచార్య’ షూటింగ్ పూర్తి చేసిన చిరంజీవి ఇప్పటికే ‘గాడ్ఫాదర్’, ‘భోళా శంకర్’ సినిమాలను కూడా పట్టాలెక్కించారు. ఊటీలో ‘గాడ్ ఫాదర్’ షెడ్యూల్ పూర్తికాగా.. ఇటీవల హైదరాబాద్లో ‘భోళా శంకర్’ షూటింగ్ ప్రారంభమైంది.